తండ్రి మందలించాడని యువకుడు సూసైడ్.. చెంగిచెర్ల గణేశ్ నగర్ లో ఘటన

తండ్రి మందలించాడని యువకుడు సూసైడ్.. చెంగిచెర్ల గణేశ్ నగర్ లో ఘటన

మేడిపల్లి, వెలుగు: అమ్మాయితో ఫోన్​లో మాట్లాడుతున్నందుకు తండ్రి మందలించడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చెంగిచర్ల గణేశ్​నగర్‌‌కు చెందిన చాపల ఎల్లయ్య కొడుకు వెంకటేశ్(19) ఓ యువతితో ఫోన్‌‌లో తరచూ మాట్లాడుతున్నాడు. దీంతో తండ్రి ఎల్లయ్య ఈ నెల 9న వెంకటేశ్​ను మందలించాడు. 

మరుసటి రోజు తెల్లవారుజామున కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంటి నుంచి వెంకటేశ్​ వెళ్లిపోయాడు. ఈ నెల 14న ఇంటి వెనుక భాగంలో ఉన్న అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకుని కుళ్లిన స్థితిలో వెంకటేశ్​ మృతదేహం కనిపించింది.